యాదాద్రి భువనగిరిలో TRS ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యపై కేసు నమోదయ్యింది. రాష్ట్ర మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్య పై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ... జిల్లా BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో మహిళలకు, సీఎం కేసీఆర్ ఒక అన్న గా, తోబుట్టువు గా అని పోల్చుతూ.. చివరికి భర్త గా అయ్యారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య రాష్ట్ర మహిళలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
see more news