YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

వైఎస్ షర్మిల స్థాపించిన YSR తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది.పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా పార్టీ అధ్యక్షుడు రాజగోపాల్‌కు  ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో రాజగోపాల్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా,షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు.

అయితే, ఆ తర్వాత కొన్ని కారణాలతో పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పెండింగులో ఉంటూ వచ్చింది. తాజాగా, ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి రాజగోపాలే అధ్యక్షుడుగా ఉన్నారు. దీంతో త్వరలోనే YSR తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది.

YSR తెలంగాణ పార్టీకి అధికారిక గుర్తింపు ఇచ్చిన భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ప్రజా సేవే ధ్యేయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చివరి వరకూ మా పార్టీ పనిచేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తామని.. ప్రజల మధ్యే ఉంటాం.వైఎస్ ఆర్ బాటలోనే పయనిస్తాం.. జై తెలంగాణ.. జోహార్ వైఎస్ ఆర్ ట్వీట్టర్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...