V6 News

భూదాన్ భూములను అమ్ముతున్నరు

భూదాన్ భూములను అమ్ముతున్నరు

కందుకూరు, వెలుగు: ప్రభుత్వ పెద్దల హస్తంతో భూదాన్​భూములను అమ్ముతున్నారని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. కందుకూరు మండలం తిమ్మాపూర్​పరిధి సర్వే నంబర్లలోని135 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నట్లు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని బుధవారం స్థానిక తహసీల్దార్​ఆఫీస్ ​ముందు కాంగ్రెస్​ లీడర్లతో నర్సింహారెడ్డి నిరసన చేపట్టారు. 

పోలీసులు అతనితోపాటు కాంగ్రెస్​ లీడర్లను అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు.