వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం వేల కోట్లు.. ఎలాంటి ఆరోగ్య విపత్తును అయినా ఎదుర్కొంటాం

వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం వేల కోట్లు.. ఎలాంటి ఆరోగ్య విపత్తును అయినా ఎదుర్కొంటాం

ఎలాంటి ఆరోగ్య విపత్తును అయినా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 2014 బడ్జెట్లో రూ. 2వేల కోట్లు కేటాయిస్తే ..2023 బడ్జెట్ లో రూ. 12వేల కోట్లు వైద్యశాఖకు కేటాయించామని తెలిపారు. ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడుక్కోకుండా ఆక్సిజన్ మనమే తయారు చేసుకుంటున్నామన్నారు. వందల పడకల ఆసుపత్రులను...వేల సంఖ్యకు పెంచుకున్నామని చెప్పారు. 

రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్ లు వస్తాయని  సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ వచ్చినా ప్రజలకు మేమున్నాం అనే ధైర్యం డాక్టర్లు ఇవ్వాలన్నారు. డాక్టర్లు పనిచేయడం లేదనే విమర్శ ఉంది అని...అది తొలిగిపోయేలా పనితీరు మార్చుకోవాలని సూచించారు. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అనే నినాదం ఉన్నత వైద్యాధికారులు మర్చిపోవద్దన్నారు. వైద్యారోగ్య శాఖలో పీఆర్ తక్కువ అని.. అందుకే విమర్శలు వస్తున్నాయని చెప్పారు.  వైద్యశాఖ  ప్రజలకు చేసే సేవ  తెలిసేలాగా పీఆర్ పెంచాలన్నారు. వైద్యారోగ్యశాఖలో ప్లానింగ్ ఇంకా బాగా మెరుగ్గా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్త భవనాలు, నూతన ఈక్విక్మెంట్ తేవడం కాదు అది ప్రజలకు ఉపయోగపడాలన్నారు.

వైద్యానికి, మానవజాతికి విడదియ్యారని బంధం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. .మానవజాతి ఉన్నన్ని రోజులు వైద్య రంగం ఉండాల్సిందే అని చెప్పారు. ఎంత పెద్ద అధికారి అయినా ..చివరకు డాక్టర్ దగ్గరకు వచ్చి ఆరోగ్యం కోసం చేయి చాపాల్సిందే అని చెప్పారు.