మెదక్ (చేగుంట), వెలుగు: వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో ఓ యువకుడు విద్యుత్తు హై టెన్షన్ టవర్ ఎక్కాడు. గ్రామానికి చెందిన ప్రదీప్ తనకు వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని అప్పటివరకు తాను కిందకు దిగనని భీష్మించాడు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, చేగుంట ఎస్సై చైతన్య కుమార్రెడ్డి అక్కడికి చేరుకొని కిందకు దిగాలని ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు.
పోలీసులు, గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి హైదరాబాద్ నుంచి పోలంపల్లికి చేరుకుని వీఆర్ఏ వ్యవస్థ గురించి అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు. దీంతో ప్రదీప్ టవర్ పై నుంచి కిందకు దిగాడు.
