పార్లమెంట్ లో సరైన చర్చ జరగడం లేదు

పార్లమెంట్ లో సరైన చర్చ జరగడం లేదు

కొత్త చట్టాలు తయారు చేసేటప్పుడు పార్లమెంట్ లో సరైన చర్చ జరగడం లేదన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V.రమణ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. పార్లమెంట్ లో నాణ్యమైన చర్చ జరక్కపోవడంతో కొత్త చట్టాల ఉద్దేశం, లక్ష్యాలను గుర్తించలేకపోతున్నామన్నారు జస్టిస్ రమణ. చట్టాలు దేని కోసం తయారు చేశారో తెలియకపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, ప్రభుత్వానికి నష్టం వస్తోందని తెలిపారు.