12 నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత

12 నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత

హైద‌రాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో …కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను ఈ నెల 12 నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ప్రకటించే వరకు రైతులు ఎవరూ మార్కెట్‌ కు రావొద్దని అధికారులు సూచించారు. వేలాది మంది రైతులతో కిటకిటలాడే మార్కెట్లలో నిబంధనలు పాటించడం లేదంటూ మార్కెట్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించకపోవడంతో మార్కెట్‌ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ ప్రకటించింది.

250 మంది వ్యాపారులు, 3వందల మంది హమాలీలు కొత్తపేట మార్కెట్‌లో పని చేస్తుంటారు. అంతేకాదు ప్రతీ రోజూ 5వందల నుంచి వేయి టన్నుల వరకు ఆ మార్కెట్‌లో పండ్ల అమ్మకాలు జరుగుతుంటాయి.