- ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించిన బెంగాల్ సీఎం
ఫరాక్కా(బెంగాల్) : లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సడెన్గా పెరగడం అనుమానాస్పదంగా ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. బుధవారం ముర్షీదాబాద్ జిల్లాలో ఫరక్కాలో జరిగిన ర్యాలీ లో దీదీ పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ఆమె మాట్లాడారు. ‘ఈసీ విడుద ల చేసిన దానికంటే దాదాపుగా 5.75 % పోలింగ్ పెరగడం ఆందో ళన కలిగిస్తోందన్నారు. చాలా కాలంగా ఈవీఎంలు కనిపించక పోవడంతో బీజేపీ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు.