ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌

ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ను ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఓఎంఆర్ విధానం ద్వారా నిర్వహిస్తామని టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 9న పరీక్ష ఉంటుందని తెలి పింది. కాగా, 563 పోస్టుల కోసం ఇప్పటికే 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండుసార్లు గ్రూప్1 ఎగ్జామ్ నిర్వహించినా, ఒకసారి పేపర్ లీక్, మరోసారి నిబంధనలు పాటించలేదనే కారణంతో పరీక్ష రద్దయింది.