
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ అందించనున్నారు సీఎం. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం దగ్గర పుష్ఫ గుచ్చంతో నివాళి అర్పించారు. సీఎంతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించారు.
ఈ సారి వేడుకలకు ప్రత్యేక అతిథులుగా జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం హాజరయ్యింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. హైదరాబాద్కు రావాలని ఆ సిటీ మేయర్ ను ఆహ్వానించారు.