ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం ప్రయత్నం: జానారెడ్డి

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం ప్రయత్నం: జానారెడ్డి

సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి. ఆర్టీసీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతున్నారన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని ఎండీ ప్రకటన చేశారని… ప్రకటన చేయడానికి ఆయన ఎవరన్న జానా… మంత్రి ఏమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందన్నారు. నిరసన తెలిపే హక్కు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని జానారెడ్డి తెలిపారు.