మధ్యప్రదేశ్కి చెందిన ఓ యువతి 15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ఇటీవల ప్రధాని మోదీ నుంచి అభినందనలు అందుకుంది. ఆ వివరాలు.. ఇండోర్కి చెందిన తనిష్క సుజిత్స్థానిక అహల్య యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పిన్న వయస్సుల్లో పట్టా సంపాదించింది.బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో సైకాలజీ కోర్సులో చేరిన ఆమె 74.20 శాతం మార్కులతో పాస్ అయింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నేను స్కూల్ ఆఫ్ సోషల్సైన్స్ దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి బీఏ సైకాలజీలో ఉత్తీర్ణత సాధించాను. అంతర్జాతీయ చట్టాలు చదువుకోవాలనుకుంటున్నాను. అవి ఇండియాలో అందుబాటులో లేనందున జురిస్ డాక్టర్కోర్సు అభ్యసించడానికి అమెరికా లేదా యూకేకి వెళ్లాలనుకుంటున్నా.
నేను 5వ తరగతి వరకు రెగ్యులర్గానే చదివాను. 11 ఏళ్ల వయస్సులో నేరుగా హైస్కూల్పరీక్ష రాశాను. అనంతరం 12వ తరగతికి వెళ్లాను. అందుకే నా డిగ్రీ త్వరగా పూర్తి అయింది. ఇలా చేయడానికి ప్రభుత్వం విద్యాశాఖ చట్టంలో కూడా మార్పులు తీసుకువచ్చింది. నాన్న కొవిడ్మహమ్మారి సమయంలో మరణించాడు. అప్పటి నుంచి ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయి. దీంతో పై చదువులకు వెళ్లడానికి సాయం కావాలని ఎంపీ శంకర్లాల్వానీ ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. అనంతరం ప్రధాని మోదీని కలవడం.. ఉన్నత చదువులకు భరోసా ఇవ్వడంతో విదేశాలకు వెళ్లాడానికి సిద్ధం అవుతున్నాను.' అని ఆమె వివరించారు.