అస్తికల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ

 అస్తికల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ

ఆస్తుల కోసం, భూముల కోసం సాధారణంగా గొడవలు జరుగుతుంటాయి. అయితే జగిత్యాలలో అస్తికల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చింతకుంట స్మశానవాటికలో నిన్న సాయంత్రం పోచమ్మ అనే వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాలు అయిపోయాక పోచమ్మ కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం భీమయ్య డెడ్ బాడీని స్మశానికి తీసుకొచ్చారు అతని కుటుంబ సభ్యులు. రాత్రి 11 కావడం, వర్షం పడ్తుండడంతో స్మశాన వాటికలో ఎవ్వరూ లేరు. పోచమ్మ దహన సంస్కారాలు జరిపిన చోటే అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం అస్తికల కోసం పోచమ్మ, భీమయ్య కుటుంబీకులు స్మశాన వాటికకు వచ్చారు. అస్తికలు మావంటే, మావి అని గొడవ పడ్డారు. ఒకే దహన వాటికపై వెంట వెంటనే అంత్యక్రియలు నిర్వహించడమే గొడవకు కారణమన్నారు స్థానికులు.