
హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. శుక్రవారం క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను నియమిం చిన హైకమాండ్.. శనివారం వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించింది. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్గా లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులు, 25 మంది రెగ్యులర్ మెంబర్లతో సహా మొత్తం 28 మందికి కమిటీలో చోటు కల్పించింది.
ఈ కమిటీలను ఏఐసీసీ చీఫ్ ఖర్గే నియమించినట్టు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి (కమిటీ చైర్మన్), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేతలు కుందూరు జానా రెడ్డి, షబ్బీర్ అలీ, వీ హన్మంత రావు, చల్లా వంశీచంద్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతా రెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీతా రావులను సభ్యులుగా నియమించారు. వారితో పాటు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్, సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్లను ఎక్స్అఫీషియో మెంబర్లుగా నియమించారు.