- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బూత్ లెవెల్లో పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న సోనియా పుట్టినరోజుతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ప్రకటించిన రోజని గుర్తు చేశారు. జూన్ 26 దాకా పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కొనసాగుతుందని చెప్పారు.