భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం

భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనీలో డోర్​టు డోర్​ ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి రంజిత్​రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్​కుమార్, కౌన్సిలర్లు మోముల స్వాతి రాజ్ కుమార్, గాయత్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.