కరోనా కట్టడికి భద్రాద్రి కొత్తగూడెం ఆఫీసర్లు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ సునీల్ దత్ అనునిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తూ లాక్డౌన్ పక్కాగా అమలయ్యేలా చూశారు. కలెక్టర్ నేతృ త్వంలో అన్ని శాఖల అధికారులు చేపట్టిన చర్యల ఫలితంగా మార్చి 24 తరువాత ఒక్క కరోనా కేసు కూడా జిల్లాలో నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన నలుగురు కూడా కోలుకోవడంతో ఇప్పుడు కేసుల సంఖ్య జీరుకు చేరింది. మార్చి 12న మొదటి కేసు.. జిల్లాలోని అశ్వాపురం మండలంలో ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతికి మొదటగా కరోనా వచ్చినట్టు మార్చి 12న డాకర్లు గుర్తించారు. లండన్ నుంచి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ కొడుకుకు మార్చి 22న కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇదే క్రమంలో డీఎస్పీకి, వాళ్లింట్లో పని చేసే మరో మహిళకు వైరస్ వ్యాపించింది. ఒకేసారి ఒకే ఇంట్లో ముగ్గురికి వైరస్ అంటుకోవడంతో కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. అన్ని శాఖల ఆఫీసర్లను అలర్ట్ చేశారు. డాక్టర్ శ్రీనునాయక్ ను ప్రత్యేక ఆఫీసర్ గా నియమించారు. ఇటలీ నుంచి వచ్చిన యువతి, లండన్ నుంచి వచ్చిన యువకుడు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారనే వివరాలను ప్రత్యేక బృందాలతో సేకరించారు. దాదాపు 150 మందికి పైగా క్వారంటైన్ కు తరలించి చికిత్స అందించారు. ఇదే క్రమంలో మర్కజ్ సంఘటన తెరపైకి రావడంతో మరింత అప్రమత్తమయ్యారు. తబ్లిక్ జమాత్ కు వెళ్లివచ్చిన 10 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు.
భద్రాద్రిలో పాజిటివ్ నుంచి నెగిటివ్ కు చేరిన కరోనా కేసులు
- తెలంగాణం
- April 20, 2020
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు