రాత్రికి రాత్రే సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్

రాత్రికి రాత్రే సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కరోనా  పేషంట్

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో ఒక వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిన ఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మోతే జనార్దన్ రెడ్డి(52) జీవనోపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ఉంటున్నాడు. జనార్దన్ రెడ్డికి హైదరాబాదులో మంగళవారం కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా స్వగ్రామమైన మడిపల్లి గ్రామానికి రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నాడు. జనార్దన్ రెడ్డి గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మరియు తహశీల్దార్ జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. అయితే జనార్దన్ రెడ్డి ఏం అనుకున్నాడో ఏమో కానీ.. బుధవారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

మీరు ఏ టైప్ మాస్క్ వాడుతున్నారు? అలాంటివి వాడితే ప్రమాదమట!

18 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందని కూడా తెలియదు

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా