కాలేజీలో ఒకేరోజు 163 మందికి కరోనా పాజిటివ్

కాలేజీలో ఒకేరోజు 163 మందికి కరోనా పాజిటివ్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కలకలం రేపుతోంది.  తిరుమల జూనియర్ కాలేజీలో ఒకేరోజు 163మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు అదే కాలేజీలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను వేరే హాస్టల్ కు తరలించారు. కాలేజీ లో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్లనాని అదేశించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు. కాలేజీలో మిగతా విద్యార్థులను వేరే ఇతర హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.