రాజేంద్రనగర్ హాస్టల్ లో 22 మంది విద్యార్థులకు కరోనా

రాజేంద్రనగర్ హాస్టల్ లో 22 మంది విద్యార్థులకు కరోనా

రాజేంద్రనగర్ లోని ఎస్టీ హాస్టల్ లో  కరోనా కలకలం రేపుతోంది. హాస్టల్ లో వార్డెన్ తో పాటు 22 మంది  విద్యార్థులకు, వాచ్ మెన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. హాస్టల్ లోని మొత్తం 105 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా 22 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు హాస్టల్ లోని రెండో అంతస్తులో హోమ్ ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. మిగతా విద్యార్థులను ఇంటికి పంపించారు.