బండ్లగూడ హాస్టల్ లో 38 మంది విద్యార్థులకు కరోనా

బండ్లగూడ హాస్టల్ లో 38 మంది విద్యార్థులకు కరోనా

రాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 206 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నాగోల్  దగ్గర బండ్లగూడలోని మైనారిటీ హాస్టల్ లో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. హాస్టల్ లో 160 మందికి టెస్టులు చేయగా....38 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో హాస్టల్ లో ఉండే విద్యార్ధలుతో పాటు వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.