శంషాబాద్ లోని బీసీ హాస్టల్ లో 45 మంది విద్యార్థులకు కరోనా

శంషాబాద్ లోని బీసీ హాస్టల్ లో 45 మంది విద్యార్థులకు కరోనా

కరోనా పంజా విసురుతోంది.  స్కూల్స్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకుల మండలంలోని జ్యోతిరావుపూలే బీసీ హాస్టల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 కు చేరింది. హాస్టల్ లో 500 మందికి టెస్టులు చేయగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు స్కూల్ లో  ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. మిగతా విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ముధోల్ లో బాలికల గురుకుల పాఠశాలలో  14 మంది విద్యార్థులు, వార్డెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.