
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. టీవీ షూటింగ్ లు ప్రారంభం కావడంతో ఇప్పుడు వైరస్ బుల్లితెర నటులను వైరస్ వ్యాపిస్తోంది. బిగ్బాస్-3తో పాపులర్ అయిన టీవీ నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రవి తెలిపాడు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా తనకు పాజిటివ్ అని తేలిందని, మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవన్నాడు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
ప్రస్తుతం రవి కొన్ని సీరియళ్లతోపాటు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆమె కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అయితే రవికృష్ణ, నవ్య కలిసి ఆమె కథ సీరియల్లో నటిస్తున్నారు. సీరియల్లోని ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.