మాజీ మంత్రి జూపల్లికి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి జూపల్లికి కరోనా పాజిటివ్

అన్ని వర్గాల వారు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు కరోనా సోకింది. మహమ్మారి బారిన పడినవారిలో కొందరు పూర్తిగా కోలుకోగా… ఇంకొందరు చనిపోయారు. లేటెస్టుగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా సోకింది. ఈ విషయమై జూపల్లి స్వయంగా తెలిపారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలకు హాజరైన తాను అక్కడ చాలా మందిని కలిశానన్నారు. ఈ క్రమంలోనే కరోనా టెస్టులు చేయించుకోగా.. టెస్టుల్లో పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. తనకు కరోనా సోకిందని… కరోనా నుంచి కోలుకుని త్వరలోనే తిరిగి నియోజకవర్గంలో అన్ని రకాల కార్యక్రమాలల్లో పాల్గొంటానని కార్యకర్తలకు వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు జూపల్లి.