కరోనా ఎఫెక్ట్: ఈ దేశాల నుండి వచ్చే వారికి వీసాల రద్దు

కరోనా ఎఫెక్ట్: ఈ దేశాల నుండి వచ్చే వారికి వీసాల రద్దు

ఢిల్లీ: ఇటలీ, ఇరాన్, జపాన్, సౌత్ కొరియా దేశాల నుండి వచ్చేవారికి కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసింది.నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియ దేశాలలో అనవసర పర్యటనలు చేయరాదని భారత పౌరులకు సూచించింది. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, సింగపూర్, తైవాన్ దేశాల నుండి వచ్చే వారికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.