
హైదరాబాద్, వెలుగు : సివిల్ వివాదాల్లో తలదూర్చితే సహించేది లేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులను హెచ్చరించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారం మాత్రమే నడుచుకోవాలని ఆదేశించారు. రూల్స్ పాటించని పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం మొదటిసారిగా నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవడం, ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు సేకరించాలని సూచించారు.ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలిప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని సీపీ సుధీర్ బాబు సూచించారు. రోజుకు కనీసం 15 నిమిషాల పాటు పీఎస్ పరిధిలో ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు.