వాటర్ ట్యాంకులో శవం.. ఆత్మహత్యేనా ?

వాటర్ ట్యాంకులో శవం..  ఆత్మహత్యేనా ?

హైదరాబాద్ లోని ఓ వాటర్ ట్యాంకులో శవం కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో పడి ఓ వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అందులో మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే శవం ఉన్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలియకుండా గత కొన్ని రోజులుగా అదే ట్యాంక్ నీళ్లు సరఫరా కావడంతో చుట్టుపక్కల ప్రజలంతా ఆ నీటినే తాగుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శవం కిషోర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ట్యాంక్ వద్ద చెప్పులు ఉండటాన్ని గమనించి.. వాటిని మృతుడి అక్కడ గుర్తు పట్టడంతో... మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో కిషోర్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.