ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు

ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు స్టేడియం స్టాండ్స్‪లో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ బాక్సుల్లో గంట నుంచి కరెంట్ కట్ అయి లైటింగ్ లేదు. దీంతో మ్యాచ్ చూద్దామని ఎంతో ఆశగా వేలు పెట్టి టికెట్ కొని వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. 

ఉప్పల్ స్టేడియంలో చీకట్లో క్రికెట్ ఫ్యాన్స్ అవస్థలు పడుతున్నారు. స్టేడియం మేనేజ్మెంట్ పై టికెట్ కొన్నవారు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే మ్యాచ్ పవర్ కట్ అయింది. కరెంట్ బిల్లు కట్టలేదని అప్పుడు విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. ఇప్పుడు కూడా అదే కారణంతో పవర్ కట్ చేసి ఉండొచ్చని ఫ్యాన్ అనుకుంటున్నారు.