
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. గురువారం ఢిల్లీలో డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హామీ ఇవ్వడంతో పాటు సీఎం అయ్యాక ఫ్యూచర్ సిటీలో జాగాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని వారు సీఎంకు వివరించారు.