ధర్మపురి శ్రీనివాస్కు అస్వస్థత

ధర్మపురి శ్రీనివాస్కు అస్వస్థత

బీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుటంబ సభ్యులు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో ఆయన సన్నిహితులు ఆస్పత్రికి  చేరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్... పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా  ఉన్నారు. మరోవైపు తన తండ్రి అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు ఎంపీ అర్వింద్ ప్రకటించారు.