గోమాంసం తినే వారు కుక్క మాంసం కూడా తినండి: దిలీప్ ఘోష్

గోమాంసం తినే వారు కుక్క మాంసం కూడా తినండి: దిలీప్ ఘోష్

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షలు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారు కుక్క మాంసం కూడా తినాలన్నారు.  బుర్ద్వాన్ లో గోప అష్టమి కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ఆయన ఆవు  తల్లి లాంటిదని…అలాంటి తల్లిని చంపిన వారిని తాము సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తామన్నారు. ఆవు తల్లిలాంటిది ఆవు  పాలు బంగారం లాంటివన్నారు. ఆవు మాంసం తినే వారు కుక్క మాంసం ఇంకా మిగతా జంతువుల మాంసం కూడా తినండి ఎవరు వద్దంటున్నారు..కానీ రోడ్లమీద కాకుండా వారి ఇంట్లో తినాలన్నారు. దేశీ ఆవులు కాకుండా విదేశీ కుక్కలను తెచ్చి ఇంట్లో పెట్టుకుని దాని మూత్రాన్ని కూడా క్లీన్ చేసే వాళ్లున్నారని వ్యాఖ్యానించారు.

దేశి ఆవు పాలలో బంగారం ఉందని, అందువల్ల దాని పాలు బంగారు రంగులో ఉన్నాయన్నారు.భారతదేశం గోపాలుడి (శ్రీకృష్ణుడు) ప్రదేశమని..  ఆవు పట్ల తమకు  ఎప్పటికీ  గౌరవం ఉంటుందన్నారు.  తల్లిలాంటి ఆవును చంపినట్లయితే తాము ఎప్పటికీ సహించబోమన్నారు,  దేశీ ఆవులు తల్లిలాంటిటివి కానీ విదేషి పిల్లలు కాదన్నారు. విదేషి భార్యలను తీసుకువచ్చిన కొందరు వ్యక్తులు  ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.