డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తమిళనాడులో కరోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థా‌యిలో విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో మహమ్మారి బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా చెంగల్పేట్‌ జిల్లా చెయ్యూర్‌ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే ఆర్.టి. అరసు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష కోసం శాంపిల్స్‌ ఇచ్చిన అరసు..కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు శనివారం ఉదయం తేలింది. చికిత్స కోసం చెన్నైలోని పైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అరసు కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టు కోసం శాంపిల్స్‌ ఇచ్చారు.రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు కరోనా బారినపడిన డీఎంకే ఎమ్మెల్యేలో అర‌సు మూడ‌వ వాడు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్యే కే.కార్తికేయన్‌కు కూడా కరోనా సోకింది. తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 3,645 పాజిటివ్‌ కేసులు నవెూదయ్యాయి.

DMK MLA Arasu tests positive for coronavirus