దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో జరగాల్సిన 8 నియోజకవర్గాల ఉపఎన్నికలను 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. బీహార్లోని వాల్మీకి నగర్ పార్లమెంటు నియోజకవర్గం సహా అస్సాంలోని సిబ్సాగర్, తమిళనాడులోని తిరువోట్టియూర్, గుడియయట్టం, మధ్యప్రదేశ్లోని అగర్, ఉత్తరప్రదేశ్లోని బులంధ్హర్, తుంద్లా, కేరళలోని చవరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడమంటే ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను రిస్క్లో పెట్టడమేనని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికలను సెప్టెంబర్ 7 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. ఏదైనా నియోజకవర్గంలో సిట్టింగ్ సభ్యుడు మరణించినా, లేదా ఇతర కారణాల చేత ఖాళీ అయినా ఆ స్థానానికి ఆరు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని, అయితే అనివార్య పరిస్థితుల్లో ఏడాది అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చని పేర్కొంది. మరోవైపు, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో పలు జిల్లాల్లో అధికారులంతా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని ఈసీ అధికారులు తెలిపారు. ఇటు కరోనా, అటు వరదల కారణంగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కరోనా కారణంగా 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వాయిదా: ఈసీ
- దేశం
- July 23, 2020
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబీనేట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!