ఈవోకు కరోనా.. ఆలయం మూసివేత

ఈవోకు కరోనా.. ఆలయం మూసివేత

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయ ఈవోకి కరోనా పాజిటివ్ రావడటంతో వారం రోజుల పాటు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు కొనసాగుతాయని..భక్తులకు మాత్రం అనుమతి లేదన్నారు. ఆలయంలోని పూజారులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.