
పర్వతగిరి, వెలుగు: చిలకకు చెప్పినట్టు చెప్పిన.. అందరినీ కూసోపెట్టి చెప్పిన.. ఓవరాక్షన్చేసిండ్లు.. సీఎంకు కోపం వచ్చిందంటూ ఈజీఎస్ ఎఫ్ఏలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలంటూ పలు మండలాల ఈజీఎస్ఎఫ్ఏలు ఆదివారం వరంగల్రూరల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఇంటి వద్ద ఆయనను వేడుకున్నారు. బతుకు భారమవుతోంది సార్..18 మంది ఎఫ్ఏలు చనిపోయారు, మమ్మల్ని క్షమించండి.. మాది తప్పే సార్అని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మీకు సాయం చేస్తనంటే వినకుండా మీరు వాళ్ల వీళ్ల మాటలు విని సమ్మె చేసిండ్రు. మీరు సమ్మెకు పోయినప్పుడు అందరినీ పిలిచి జాయిన్ అవ్వండని సీఎం చెప్పినా వినకుండా మీ మెడకాయ మీరే కోసుకున్నారని అన్నారు. యూనియన్ లీడర్లు చేయబట్టే సమ్మెకు పోయి పిచ్చిపిచ్చి స్టేట్ మెంట్లు ఇచ్చి ఆయన అంతు చూస్తామనడంతో మీ మీద కోపం వచ్చిందన్నారు. తాను సీఎంతోటి మాట్లాడుతున్నానంటూ కాన్వాయ్లో వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎఫ్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి తదితరులు పాల్గొన్నారు.