18 ఏళ్లు నిండిన ప్రతి ముదిరాజ్ కు మత్స్యశాఖలో సభ్యత్వం కల్పించాలి

18 ఏళ్లు నిండిన ప్రతి ముదిరాజ్ కు మత్స్యశాఖలో సభ్యత్వం కల్పించాలి

జగిత్యాల జిల్లా : ఇచ్చిన హామీలు అమలు  చేయకుంటే ఊరుకోబోమంటూ హెచ్చరించారు ముదిరాజ్ కులస్తులు. జగిత్యాల జిల్లాలో ముదిరాజ్ లు మహాధర్నా చేపట్టారు. జగిత్యాల -కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో  చేశారు. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ముదిరాజ్ కు మత్స్యశాఖలో సభ్యత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యశాఖలో బెస్తవారికి మాత్రమే సభ్యత్వం కల్పించారని.. తమకు కూడా  మెంబర్ షిప్ ఇవ్వాలని కోరారు.  హామీలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.