ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఓ టీవీ చానల్ యజమానిపై నాంపల్లి కోర్టు నాన్ బె యిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. ఇందుకోసం కోర్టులో నోటీసులు సిద్ధమ వుతున్నట్టు సమాచారం. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఏ1గా ఉన్నారు. ఈ కేసులో నింది తులంతా ఆయన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అభియోగం ఉంది. ఈ మేరకు వాళ్లు స్టేట్ మెంట్లు కూడా ఇవ్వడం గమనార్హం.