కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ

జయశంకర్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ  కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు  మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గురువారం (మే 9) న మహాముత్తారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తీబాయి మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలు ఇవాళ ఆమె స్వగ్రామం బోర్లగూడెంలో జరిగాయి. జాడి కీర్తీబాయి  పార్ధివ దేహానికి సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ.. అనంతరం అంతిమ యాత్రంలో  ఆమె పాడె మోశారు. కీర్తీబాయి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.