హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ ఫుడ్ బ్రాండ్ ఎంఎస్ మందీ అండ్ షవర్మా కోసం జొమాటో నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి. క్లౌడ్ కిచెన్గా ప్రారంభమైన ఈ బ్రాండ్ ఇప్పుడు రెండు ఔట్లెట్లను కూడా నిర్వహిస్తోంది. జొమాటోలో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2020లో 498 ఆర్డర్లు రాగా 2025 నాటికి ఏటా 1,17,757 ఆర్డర్లకు చేరుకుంది. ప్రతి నెలా 12 వేలకు పైగా ఆర్డర్లను అందిస్తున్నామని సంస్థ తెలిపింది.
