చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్విపై ఆమె భర్త అరవింద్ నడిరోడ్డుపైనే కత్తితో కిరాతకంగా దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ సెల్వి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాడి సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో భర్త అరవింద్కు కూడా గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న అరవింద్.. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు అరవింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
