కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో ప్రతి నెలా రెండో గురువారం ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ డాక్టర్లు అన్వేష్, నీలేశ్, స్నేహ తెలిపారు. బుధవారం హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు.
మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. -బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. హాస్పిటల్కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కర్ణాకర్, పీఆర్ అబ్దుల్ వకీల్ పాల్గొన్నారు.
