అగ్రిసెట్ గడువు ఆగస్టు31 వరకు పొడిగింపు : అగ్రి వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

అగ్రిసెట్ గడువు  ఆగస్టు31 వరకు పొడిగింపు : అగ్రి వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​ యూనివర్సిటీ అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ -2026 కు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకూ ఆన్ లైన్​లో అప్లయ్​ చేసుకోవచ్చని తెలిపారు. 

అగ్రికల్చర్​ డిప్లొమా, అగ్రికల్చర్​ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ) కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునే వారు ఈ అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ -2026 పరీక్ష రాయాల్సి ఉంటుందని వీసీ వివరించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ https://pjtau.edu.in ను సందర్శించాలని సూచించారు.