మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా సోకింది. దాంతో ఆయన హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్, పీఏ, గన్ మెన్ లకు కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గతంలో వరంగల్ కు చెందిన రాజకీయ నాయకులు కరోనా బారినపడి కోలుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారినపడి కోలుకున్నారు. ఆయన కోలుకున్న కొన్ని రోజులకే ఆయన కొడుకు, కోడలుకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం వరంగల్ మేయర్ దంపతులు కూడా కరోనా బారినపడ్డారు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బిగాల గణేష్, భాస్కర్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

For More News..

కరోనా భయంతో ఆటోలోనే మృతదేహం.. అటునుంచి అటే అంత్యక్రియలకు..

రాత్రికి రాత్రే సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్

మీరు ఏ టైప్ మాస్క్ వాడుతున్నారు? అలాంటివి వాడితే ప్రమాదమట!