
- తహసీల్దార్ ఆఫీస్ ముందు మాజీ సర్పంచ్ ఆందోళన
మెదక్: నా భూమి నాకు ఇప్పించాలి.. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులందరితో కలసి మెదక్ జిల్లా నర్సాపూర్ తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తాత తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న చేసుకుంటున్న నా భూమిని అధికార పార్టీ నాయకులు గుంజుకున్నరాని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్నతమ భూమిని తమదని దబాయిస్తున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. నా భూమి నాకిప్పియ్యకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేసుకుంటం అని సదరు మాజీ సర్పంచ్ హెచ్చరించారు.