గంజాయి కేసులో ఒకరిని ఇరికించబోయి.. నలుగురు వ్యక్తులు ఇరుక్కున్నారు

గంజాయి కేసులో ఒకరిని ఇరికించబోయి..  నలుగురు వ్యక్తులు ఇరుక్కున్నారు

పరిగి వెలుగు : ఓ వ్యక్తిపై కుట్ర పన్ని గంజాయి కేసు మోపేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు ఇరుక్కుపోయారు.  మంగళవారం పరిగి డీఎస్పీ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు.  పరిగి టౌన్ కు చెందిన ముషారఫ్ అనే వ్యక్తి కారులో గంజాయి పెట్టి నేరం మోపేందుకు సయ్యద్ వజ్రఫ్, వడ్ల చారి, సతీశ్, ప్రశాంత్​లు ప్లాన్ వేశారు.

ముందస్తు సమాచారం అందడంతో  పోలీసులు కారులో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. ముషారఫ్ పై ద్వేషంతోనే కారులో గంజాయి పెట్టినట్లు సయ్యద్ వజ్రఫ్, వడ్ల చారి, సతీశ్, ప్రశాంత్ ఒప్పుకున్నారు. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.