సంక్రాంతికి 4 వేల స్పెషల్ బస్సులు.. ఇందులోనూ మహిళలకు ఫ్రీ

సంక్రాంతికి 4 వేల స్పెషల్ బస్సులు.. ఇందులోనూ మహిళలకు ఫ్రీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దీంతో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లవచ్చని సూచించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ పై ఆర్టీసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి స్పెషల్ బస్సుల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఆర్. ఎమ్ లు, డీ. ఎమ్ లు, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులతో బస్ భవన్ లో సమావేశం నిర్వహించారు.

సంక్రాంతి పండుగ కోసం దాదపు 4వేల బస్సుల ను నడిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతికి కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ తో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ సర్వీస్ లపై అధికారులు ఫోకస్ చేయాలని ఎండీ సూచించినట్టు తెలుస్తుంది.