న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే రికవరీలు కూడా భారీ స్థాయిలో పెరుగుతుండటం శుభ పరిణామంగా చెప్పొచ్చు. టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకుంటుండటంతోనే ఇది సాధ్యమయ్యిందని కేంద్రం తెలిపింది. దేశ కరోనా రికవరీ రేటు 77.77 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ‘ఇండియాలో కరోనా రికవరీ రేటు విపరీతంగా పెరుగుతోంది. మే నెలలో వైరస్ బారి నుంచి 50 వేల మంది కోలుకోగా.. అప్పటి నుంచి ఇప్పటికి మొత్తంగా 36 లక్షల మంది రికవర్ అయ్యారు. దాదాపు ప్రతి రోజు 70 వేల మంది వరకు రికవర్ అవుతున్నారు. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 3.8 శాతం ఎక్కువగా ఉన్నారు. కచ్చితమైన దృష్టితో సహకారం, ప్రతిస్పందన, సమర్థమైన చర్యలు, టెస్టింగ్లో వేగం, హై క్వాలిటీ క్లినికల్ కేర్తోనే ఇది సాధ్యమైంది’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్లో కరోనా రికవరీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,59,984కు చేరింది. ఒక్క శనివారమే రికార్డు స్థాయిలో 97,570 కేసులు నమోదయ్యాయి. కరో్నా మరణాల సంఖ్య 77,472కు చేరింది.
గుడ్న్యూస్: కరోనా రికవరీల్లో భారీ పెరుగుదల
- దేశం
- September 13, 2020
లేటెస్ట్
- ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం!
- తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- సీఎం రేవంత్ -గడ్డం వంశీ | అమిత్ షాపై కేసు | కేసీఆర్ -ఫోన్ ట్యాపింగ్ | రాహుల్ నామినేషన్ | V6 తీన్మార్
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన