కుమార్తెల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న గంభీర్

కుమార్తెల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న గంభీర్

గౌతమ్ గంభీర్ తన కుమార్తెల కాళ్లు కడగడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గంభీర్ 2018లో క్రికెట్ లో అన్నీ ఫార్మట్లకు వీడ్కోలు పలికి బీజేపీలో చేరారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ ఎంపీగా విజయం సాధించారు. ఓ వైపు ఎంపీ గా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. దసరా పండుగ పర్వదినం సందర్భంగా నిర్వహించే అష్టమి కంజక్ ఆచారాన్ని పాటించిన గంభీర్ తన కుమార్తెల కాళ్లు కడిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో చేసి..తాను చేసిన ఈ సర్వీస్ కు బిల్లు ఎక్కడి పంపాలంటూ తన భార్య నటాషాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. గంభీర్ ట్వీట్లపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుమార్తెలపై తల్లిదండ్రుల ప్రేమ మరువలేనిదంటూ కామెంట్లు చేస్తున్నారు.