సికింద్రాబాద్, వెలుగు: నిమ్స్లో సర్జన్నని, రోగం నయం చేస్తానని చెప్పి మహిళను నమ్మించి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి బంగారం కొట్టేసిన ఫేక్ డాక్టర్ను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి బుధవారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలం చిన్ననట్టుకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ(28) జల్సాలకు బానిసయ్యాడు. 2016 నుంచి చోరీలు మొదలుపెట్టాడు. రైళ్లలో ప్రయాణిస్తూ టికెట్కలెక్టర్నని చెప్పుకుని ప్యాసింజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. కొన్నిరోజులు ఫేక్ డాక్టర్, ఫేక్ఐఏఎస్ అధికారి అవతారమెత్తి జనాలను మోసం చేశాడు. జూబ్లీహిల్స్, ఏపీలోని పలు పీఎస్ల పరిధిలో ఇలాంటి మోసాలు చేసి చాలాసార్లు జైలుకెళ్లి వచ్చాడు.
ఈ నెల 2న గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు.. తన పక్క సీటులో ఉండే సుజాతకు మాయమాటలు చెప్పి, రెజిమెంట్బజార్లోని లాడ్జికి తీసుకెళ్లి మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, బ్యాగ్లోని క్యాష్ కొట్టేశాడు. బాధితురాలు గోపాలపురం పీఎస్లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టి మంగళవారం సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. రూ.3 లక్షల విలువైన గోల్డ్ చైన్, నెక్లెస్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

