హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర శాసన మండలిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా షెడ్యూల్ను ప్రకటించింది. ఆ స్థానం నుంచి ఎంపికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేడయంతో ఆ స్థానం ఖాళీ అయింది.
అందుకు అనుగుణంగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా షెడ్యూల్ను ప్రకటించింది. ఇందుకోసం ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 4 న ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.